Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధుల్లో పడ్డ వలస కూలీలకు కావల్సింది అప్పు కాదు, డబ్బు: రాహుల్ గాంధీ

Webdunia
శనివారం, 16 మే 2020 (16:04 IST)
కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోసం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతులకు కానీ, వలస కార్మికులకు కానీ తక్షణ ఉపశమనం ఇవ్వదని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సంక్షోభ సమయంలో మన ప్రజలకు డబ్బు కావాలి. ప్యాకేజీలు కాదు. వీధిలో నడుస్తున్న వలస కూలీకి డబ్బు కావాలి, అప్పు కాదు. బాధపడుతున్న రైతుకు డబ్బు కావాలి, అప్పు కాదు. మనం చేయకపోతే ఇది విపత్తుగా పరిణమిస్తుంది. 
లాక్డౌన్ ద్వారా నిరుద్యోగులుగా మిగిలిపోయిన వలసదారుల బ్యాంకు ఖాతాలకు కనీసం 7,500 రూపాయలు నేరుగా బదిలీ చేయాలని పిఎం మోడీకి రాహుల్ గాంధీ అభ్యర్థన చేశారు. కాగా కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 86,000 కేసులు నమోదవగా 2,700 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన ఈ కరోనా వైరస్ కారణంగా వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments