Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతికి కరోనా పరీక్షలు.. అన్ని కార్యక్రమాలు రద్దు

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (09:21 IST)
కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన అన్ని రకాల అధికారిక, వ్యక్తిగత పర్యటనలను రద్దు చేసుకున్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ లండన్‌ పర్యటనకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండానే, పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి అనేక మంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, హితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కనికాకు పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె పార్టీలో పాల్గొన్నవారందరికీ ఈ వైరస్ సోకిందన్న భయం పట్టుకుంది.
 
ఇదిలావుంటే, పార్టీకి బీజేపీ యువ ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. కనికకు 'కరోనా' ఉందన్న వార్తల నేపథ్యంలో తనకు కూడా ఈ వైరస్ సోకిందన్న అనుమానంతో ఆయన హోం క్యారంటైన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన బీజేపీ ఎంపీల బృందంతో వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. 
 
ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments