Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఇంటి ముంగిటే ఆధార్ కార్డులో మార్పులు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (08:13 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో ఉండే తప్పొప్పులను ఇంటి ముంగిటే సరిదిద్దేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం పోస్ట్‌మేన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోనుంది. నిజానికి ప్రభుత్వం ఆధార్ కార్డులోని తప్పొప్పులు, ఇతర మార్పులు చాలా కష్టతరంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 48 వేల మంది పోస్ట్‌మేన్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ తప్పొప్పులను సవరించేందుకు వీలుగా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల సాయంతో సేవలు అందించనుంది. ఈ ప్రత్యేక కిట్‌ల ద్వారా ఆధార్ నంబరుతో మొబైల్ ఫోన్ నెంబరును అనుసంధానం చేయడం, ఇతర వివరాలను అప్‌డేట్ చేయడం, బాలల వివరాలను ఆధార్‌లో నమోదు చేయడం వంటి విధులను వీరికి కేటాయించనున్నారు. 
 
ఈ ప్రక్రియలో భాగంగా, పోస్ట్‌మేన్‌‌లకు 13 వేల మంది బ్యాంకింగ్ అధికారులు కూడా సహకరించేలా కేంద్రం ఆదేశారు జారీచేసింది. దేశంలోని మారుమల పల్లెల్లో సైతం ఆధార్ సేవలు అందించడమే తమ లక్ష్యమని యూఐడీఏఐ పేర్కొంది. ప్రస్తుత ట్యాబ్, మొబైల్ ఫోన్ల ద్వారా పోస్ట్‌మేన్‌లు పైలెట్ ప్రాజెక్టు కింద చిన్న పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డులోని తప్పొప్పులను ఇంటి ముంగిటే సరిదిద్దుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments