Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తితిదే ఈవో ధర్మారెడ్డి సర్వీసు పొడగింపు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (07:56 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి సర్వీసులను వైకాపా ప్రభుత్వం మరో రెండేళ్లు పొడగించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీచేసింది. కేంద్ర సర్వీసులకు చెందిన ఈయన ఇప్పటికే ఏడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఇపుడు మరో రెండేళ్లపాటు ఏపీలో సేవలు అందించనున్నారు. 
 
ప్రస్తుతం ఈయన తితిదే ఈవోగా పని చేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉండే ఏ అధికారి అయినా రాష్ట్ర సర్వీసుల్లో అత్యధికంగా ఏడేళ్లకు మించి పని చేయడానికి వీల్లేదు. ఈ లెక్కన ధర్మారెడ్డి ఏడేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుని తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లాల్సివుంది. 
 
అయితే, ధర్మారెడ్డి సేవలను ఎలాగైనా పొడగించుకోవాలన్న పట్టుదలతో సాగిన ఏపీ ప్రభుత్వం పావులు కదిపింది. మరో రెండేళ్ళపాటు ధర్మారెడ్డిని ఏపీ సర్వీసులోనే కొనసాగేలా అనుమతి ఇవ్వాలని ఈ కేసును ప్రత్యేకమైనదిగా పరిగణించాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. 
 
ఒకవేళ దీనికి కేంద్రం సమ్మతించకపోతే ధర్మారెడ్డి కేంద్ర సర్వీసులకు రాజీనామా చేసి ఆయనను రాష్ట్ర ప్రభుత్వం అధికారిగా నియమించుకుని తితిదేలోనే కొనసాగించే దిశగా ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ, ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ధర్మారెడ్డి మరో రెండేళ్ల పాటు ఏపీ సర్వీసుల్లో కొనసాగనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments