Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో బర్త్‌డే పార్టీకి పిలిచి అఘాయిత్యం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (07:37 IST)
భాగ్యనగరిలో మరో దారుణం జరిగింది. బర్త్‌డే పార్టీకి పిలిచి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్డులో పట్టపగలు జరిగింది. ఈ అత్యాచారం కూడా కారులోనే జరగడం గమనార్హం. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని ఆమ్నేషియా పబ్ వద్ద మైనర్ బాలికను అపహరించి కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైనంది. ఈ కేసులో పలువురు రాజకీయ ప్రముఖల పిల్లలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ రాజకీయ పార్టీకి చెందిన వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇదిలావుంటే, సోమవారం మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు సురేష్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు పట్టపగలు నెక్లెస్ రోడ్డుపై చోటుచేసుకోవడం కలకలంరేపింది. ఓ మైనర్ బాలికను పుట్టిన రోజు వేడుకల పేరు చెప్పిన నెక్లెస్ రోడ్డుకు తీసుకొచ్చిన సురేష్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన  ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును త్వరతిగతిన ఛేదించారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments