Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్.. ఎందుకు తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (11:26 IST)
జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో సైనిక వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కేంద్ర హోం శాఖ హైఅలెర్ట్ ప్రకటించింది. కేంద్ర పారా మిలిటరీ బలగాలు తమ కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
గురువారం జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. పూంఛ్ జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళుతున్న ఆర్మీ వాహనంపై తీవ్రవాదులు గ్రెనేడ్లతో దాడికి తెగబడిన విషయం తెల్సిందే. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమై హైఅలెర్ట్ ప్రకటించింది. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులతో పాటు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్‌లో కూడా ఉగ్రవాదులు పాక్ వైపు నుంచి తిరిగి చొరబాట్లకు పాల్పడకుండా హైఅలెర్ట్ ప్రకటించింది. 
 
అలాగే, ఈ దాడి తర్వాత భారత భద్రతా దళాలు మెంధార్ సబ్ డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేసింది. భటా, ధురియన్‌ మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో భింబర్ గలి నుండి సురన్‌కోట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్టు పూంచ్ జిల్లాలోని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం