Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త ఏరేసిన ప్రధాని నరేంద్ర మోడీ - స్వచ్ఛ భారత్ సందేశం

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (15:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మరోమారు చెత్త ఏరివేసి, స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రజలకు పంపారు. ఆదివారం ఢిల్లీలోని 'ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడవ'ను ఆయన ప్రారంభించారు. 
 
అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కనిపించిన చిన్నపాటి వ్యర్థాలను ప్రధాని స్వయంగా తన చేతులతో ఎత్తారు. ఓ ప్లాస్టిక్‌ సీసానూ సేకరించారు. 
 
సంబంధిత వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'ఐటీపీఓ టన్నెల్‌ ప్రారంభోత్సవం సందర్భంగానూ ప్రధాని మోడీ.. చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారు' అని పేర్కొన్నారు.
 
ప్రగతి మైదాన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అంతర్భాగమే ఈ 'ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్‌'. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments