Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త ఏరేసిన ప్రధాని నరేంద్ర మోడీ - స్వచ్ఛ భారత్ సందేశం

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (15:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మరోమారు చెత్త ఏరివేసి, స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రజలకు పంపారు. ఆదివారం ఢిల్లీలోని 'ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడవ'ను ఆయన ప్రారంభించారు. 
 
అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కనిపించిన చిన్నపాటి వ్యర్థాలను ప్రధాని స్వయంగా తన చేతులతో ఎత్తారు. ఓ ప్లాస్టిక్‌ సీసానూ సేకరించారు. 
 
సంబంధిత వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'ఐటీపీఓ టన్నెల్‌ ప్రారంభోత్సవం సందర్భంగానూ ప్రధాని మోడీ.. చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారు' అని పేర్కొన్నారు.
 
ప్రగతి మైదాన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అంతర్భాగమే ఈ 'ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్‌'. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments