Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (14:23 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ వైమానికస్థావరం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడమే. ఆయన మంగళవారం ఈ వైమానిక స్థావరానికి వెళ్లి గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ఆయన వైమానిక దళ అధికారులు, సైనికులతో ముచ్చటించారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై సాయుధ బలగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్కడే ఓ గంట పాటు ఉన్నారు 
 
గత ఏప్రిల్ నెల 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిగా మే 7వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. ఆ తర్వాత మే 9, 10వ తేదీల్లో పాకిస్థాన్‌ దాడికి యత్నించిన వైమానిక స్థావరాల్లో ఆదంపూర్ ఒకటి కావడం గమనార్హం. ఈ పర్యటన ద్వారా సైనికుల ధైర్యసాహసాలను, నిబద్ధతను ప్రధాని కొనియాడారు. భారత్ మాతాకీ జై అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసివున్న ఫోటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం