Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మా సైనికులను చంపేసింది : మృతుల పేర్లను వెల్లడించిన పాకిస్థాన్

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (13:38 IST)
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్య వల్ల పాకిస్థాన్‌లో ఆస్తి, ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. అయితే, తమకు ఎలాంటి హాని జరగలేదంటూ బుకాయించి, భారత్‌తో జరిగిన యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. అయితే, రోజులు గడిచేకొద్దీ తమకు జరిగిన నష్టాన్ని తాజాగా వెల్లడించింది.
 
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో తమ దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ పాలకులు తాజాగా వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ ద్వారా 11 మంది సైనికులు చనిపోయినట్టు తాజాగా పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు పాక్ ఆర్మీకి చెందిన వారుకాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని తెలిపారు. మరో 78 మంది గాయపడినట్టు పేర్కొంది. 
 
భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు మరణించగా 121 మంది గాయపడినట్టు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
అలాగే, వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.
 
అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్ సౌనికులు మృతి చెంది ఉంటారని భారత్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. అలాగే, 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు జరిగిన నష్టాన్ని తాజాగా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments