Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథుడి సేవలో ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కాశీ విశ్వనాథుడి సేవలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయన ముందుగా గంగానదిలో లలితా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత ఆ నదీజలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగానది నీటిలో ఆలయానికి వెళుతున్న సమయంలో ప్రధాని మోడీకి ఆలయ పూజారులు స్వాగతం పలికారు. 
 
నది నుంచి కొంతదూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ స్వామి వారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలో మోడీతో వేద పండితులు అభిషేకం చేయించారు. తొలుత వారు సంకల్పం చదివారు. 
 
విఘ్నేశ్వర పూజ, బిల్వపత్రం సమర్పణ, పంచామృత పూజ, వస్త్రం, యజ్ఞోపవీతం సమర్పణ, నమక చమకాలతో విశ్వనాథుడి ఆలయం మంత్రోచ్ఛరణతో ప్రజ్వరిల్లింది. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసిన మోడీ నైవేద్యం సమర్పించారు. 
 
కర్పూరహారం, కరుణావతారం అంటూ గర్భగుడిలో విశ్వనాథుడిని కీర్తించారు. ఆలయ పూజాలులు ప్రధాని మోడీకి ఆశీర్వాదాలు అందించారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments