Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం-కిసాన్ పథకం.. ఈ-కేవైసీ ఆప్షన్‌ పునరుద్ధరణ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:55 IST)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో ఈ-కేవైసీ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. 
 
రైతులకు ఈ పథకంలో భాగంగా ఏటా 3 దఫాల్లో రూ.6 వేలను వారి ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. 11వ విడతలో భాగంగా పథకం సాయం పొందేందుకు గతంలో ఈ-కేవైసీ తప్పనిసరి అని చెప్పింది. ఆ తర్వాత ఈ-కేవైసీని తాత్కాలికంగా రద్దు చేసింది. 
 
ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించింది. ఇందులో భాగంగా పథకం నుంచి ప్రయోజనం పొందే రైతులు మే 31, 2022లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు రైతులు సీఎస్‌సీ(కామన్ సర్వీసు సెంటర్ల)కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. 
 
ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కేంద్రం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments