Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు.. ప్రధాని ఆదేశం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:56 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇది ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని సురక్షితంగా మాతృదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇప్పటికే ఐదు విమానాల్లో అనేక మంది మాతృదేశానికి చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఆపరేషన్ గంగను వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని విషయాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌లోని భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిస్తున్నారు. 
 
వీరిలో హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్‌లు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్ళనున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్రం దృష్టిసారించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments