Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (12:51 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. 17 మందితో వెళుతున్న పడవ ఒకటి గంగా నదిలో మునిగిపోయింది. బాధితుల్లో 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, మరో ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఆదివారం ఉదయం జరిగింది. పాట్నాకు సమీపంలోని బాఢ్ గ్రామం గంగానది ఒడ్డున ఉంది. గంగా దసరా పండుగ సందర్భంగా ఆదివారం పెద్ద సంఖ్యలో స్థానికులు నదీ తీరానికి వచ్చారు. నదీ స్నానం చేసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ ఎక్కారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ మునిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడగా, 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలినవారు నీళ్లలో మునిగిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. 
 
ఈ ప్రమాదం సమయంలో పడవలో మొత్తం 17 మంది ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరు.. నదిలో మునిగిపోయిన పడవలో సామర్థ్యానికి మించి అంటే దాదాపు 25 మంది వరకు ఉంటారని, ఈ కారణంగానే పడవ మునిగిపోయివుంటుందని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా గుర్తించలేకపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments