Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల అపరాధం

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (11:31 IST)
దేశంలోని ప్రైవేట్ విమాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సంస్థకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ సెక్యూరిటీ తేరుకోలేని షాకిచ్చింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో రన్‌వే పై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భారీ అపరాధం విధించింది. ఇలాంటి చర్యకు పాల్పడిన ఇండిగో సంస్థకు ఏకంగా రూ.1.2 కోట్ల అపరాధం విధించింది. 
 
ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించడం జరిగింది. అక్కడ ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రిపూట డిన్నర్ సమయం కావడంతో రన్‌వేపైనే ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్ వే పై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ముంబై ఎయిర్ పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments