Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల అపరాధం

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (11:31 IST)
దేశంలోని ప్రైవేట్ విమాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సంస్థకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ సెక్యూరిటీ తేరుకోలేని షాకిచ్చింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో రన్‌వే పై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భారీ అపరాధం విధించింది. ఇలాంటి చర్యకు పాల్పడిన ఇండిగో సంస్థకు ఏకంగా రూ.1.2 కోట్ల అపరాధం విధించింది. 
 
ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించడం జరిగింది. అక్కడ ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రిపూట డిన్నర్ సమయం కావడంతో రన్‌వేపైనే ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్ వే పై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ముంబై ఎయిర్ పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments