Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉభయ సభల్లో విపక్షాల ఆందోళను - కొనసాగుతున్న వాయిదాలపర్వం

Webdunia
సోమవారం, 26 జులై 2021 (15:39 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళన ఏమాత్రం ఆగడం లేదు. కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని, పెగాసస్ స్పై వేర్‌పై విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులంతా ఇరు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలను స్పీకర్లు వాయిదావేశారు. 
 
ముఖ్యంగా పెగాసస్‌పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. 
 
మరోవైపు, విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ సైతం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. యుద్ధవీరులకు నివాళి వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు తెలిపాయి. 
 
దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు. మీరాబాయికి అభినందనలు అదేసమయంలో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. 
 
21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments