Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి జవాన్లపై కాల్పులు జరిపిన జవాను.. ఇద్దరు మృతి

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (11:30 IST)
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. తనతో పాటు పని చేసే జవాన్లపై సాటి జవాను కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా జవాన్లు పోర్ బందర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
వచ్చే నెల 1, 5వ తేదీల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం భద్రతా బలగాలను తరలిస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా పోర్‌ బందర్‌కు చేరుకున్న జవాన్లకు అధికారులు సమీపంలోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటుచేశారు. 
 
అయితే, శనివారం రాత్రి భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కొంతమంది జవాన్లు బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో జవాన్ల మధ్య వివాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47 గన్‌‍తో కాల్పులు జరిపాడు. 
 
దీంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం జామ్ నగర్ ఆస్పత్రికి తరలించినట్టు పోర్‌బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నారు. కాల్పులు జరిపిన జవానును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments