Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుకు కన్యత్వ పరీక్ష - టెస్టులో విఫలమైందంటూ కట్నం డిమాండ్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:40 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే హేయమైన ఘటన చోటుచేసుకుంది. 24 యేళ్ళ నవ వధువుకు పెళ్లయిన తొలి రోజే కన్యత్వ పరీక్షను అత్తమామలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ వధువు విఫలం కావడంతో రూ.10 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ వధువు పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారాలో మే 11వ తేదీన ఓ యువతికి వివాహం జరిగింది. అదే రోజు రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహించారని ఆ యువతి తాజాగా ఆరోపించింది. తాను ఆ పరీక్షలో విఫలం కావడంతో భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని వాపోయింది. మే 31 స్థానిక ఆలయంలో కుల పంచాయతీ జరిపి తాను శీలవతిని కాదని ముద్ర వేశారని, రూ.10 లక్షలు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. 
 
ఈ యువతికి పెళ్లికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారనికి గురైందని, ఈ విషయం తెలుసుకున్న అత్తమామలు ఈ కన్యత్వ పరీక్షలు నిర్వహించాలని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుభాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం