Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వక్రబుద్ధి : ప్రధాని మోడీ విమానానికి పర్మిషన్ నిరాకరణ

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (18:22 IST)
పాకిస్థాన్ మరోమారు వక్రబుద్ధిని బయటపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం పాకిస్థాన్ గగనతలంపై ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో ప్రధాని మోడీ సౌదీ పర్యటన కోసం పాక్ గగనతలం మీదుగా కాకుండా మరో మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. 
 
జమ్మూకాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై విద్వేషంతో పాకిస్థాన్ రగలిపోతున్న విషయం తెల్సిందే. జమ్మూకాశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన నేటికీ ఆగలేదని పాక్ ఆరోపిస్తోంది. 
 
 ప్రధాని మోదీ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోడీ సౌదీ అరేబియా పర్యటన కోసం అనుమతి ఇవ్వాలని భారత అధికారులు పాకిస్థాన్ సర్కారును కోరారు. అయితే, భారత అధికారుల విజ్ఞప్తిని పాక్ తిరస్కరించింది. 
 
గత నెలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా పాక్ ఇలాగే అనుమతించలేదు. కాగా, మోడీ విమానానికి అనుమతి నిరాకరణపై తమ వైఖరిని భారత హైకమిషనర్‌కు తెలియజేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments