Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వక్రబుద్ధి : ప్రధాని మోడీ విమానానికి పర్మిషన్ నిరాకరణ

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (18:22 IST)
పాకిస్థాన్ మరోమారు వక్రబుద్ధిని బయటపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం పాకిస్థాన్ గగనతలంపై ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో ప్రధాని మోడీ సౌదీ పర్యటన కోసం పాక్ గగనతలం మీదుగా కాకుండా మరో మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. 
 
జమ్మూకాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై విద్వేషంతో పాకిస్థాన్ రగలిపోతున్న విషయం తెల్సిందే. జమ్మూకాశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన నేటికీ ఆగలేదని పాక్ ఆరోపిస్తోంది. 
 
 ప్రధాని మోదీ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోడీ సౌదీ అరేబియా పర్యటన కోసం అనుమతి ఇవ్వాలని భారత అధికారులు పాకిస్థాన్ సర్కారును కోరారు. అయితే, భారత అధికారుల విజ్ఞప్తిని పాక్ తిరస్కరించింది. 
 
గత నెలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా పాక్ ఇలాగే అనుమతించలేదు. కాగా, మోడీ విమానానికి అనుమతి నిరాకరణపై తమ వైఖరిని భారత హైకమిషనర్‌కు తెలియజేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments