Webdunia - Bharat's app for daily news and videos

Install App

టపాసుల నిషేధానికి మతం రంగు పులమొద్దు : సుప్రీంకోర్టు

ఢిల్లీలో టపాసుల నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్ 1వ తేదీ వరకు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో టపాసులపై నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (15:00 IST)
ఢిల్లీలో టపాసుల నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్ 1వ తేదీ వరకు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో టపాసులపై నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. టపాసుల నిషేధానికి మతం రంగు పులమడం తమను బాధ కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులు కాల్చడంపై ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోతుందని కోర్టు తెలిపిన విషయం విదితమే. 
 
ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో టపాసుల అమ్మకంపై నిషేధం విధిస్తూ గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే. నిషేధాన్ని సడలించాలని లేనిపక్షంలో ఆంక్షలు తగ్గించాలని వ్యాపారులు రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
 
దీనిపై స్పందించిన కోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది. హిందూ పండుగ మనోభావాలను దెబ్బతీస్తున్నారని భావించొద్దని.. ఇది బాధాకరమే అయినా పర్యావరణ పరిరక్షణ అనేది అంత కంటే ముఖ్యం అని వ్యాఖ్యానించింది. తీర్పుకు మతం రంగు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ ఒకటో తేదీ వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని మళ్లీ స్పష్టం చేసింది. తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments