Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిన వ్యక్తి మృతి.. ఆంబులెన్స్‌కు నిప్పు పెట్టిన బంధువులు

Webdunia
గురువారం, 23 జులై 2020 (12:57 IST)
Fire
కరోనా సోకిన వ్యక్తి.. త్వరలో ఆ రోగం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని అనుకున్నాడు. కానీ ఇంతలో ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని బీమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
 
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని బీమ్స్ ఆస్పత్రికి అతని బంధువులు తరలించారు. అక్కడ కరోనా బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబులెన్స్‌కు నిప్పు పెట్టారు. అది పూర్తిగా కాలిపోయింది.
 
అంతటితో ఆగకుండా ఆస్పత్రిపై రాళ్ల దాడి చేశారు. రోగి చనిపోయినప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్‌పై దాడి చేసేందుకు కూడా వారు యత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,764 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 55 మంది మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments