Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన భద్రతా దళాలు కోవిడ్‌పై కూడా పోరాడగలరు: అమిత్ షా

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (15:40 IST)
మన దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భద్రతా దళాల పాత్ర ప్రశంసనీయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ‘‘కోవిడ్-19పై భారత దేశం చేస్తున్న యుద్ధంలో, మన భద్రతా దళాలు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నాయి, దీనిని ఎవరూ కాదనలేరు. నేడు ఈ కరోనా యోధులకు గౌరవ వందనం చేస్తున్నాను.

వారు ఉగ్రవాదంపై మాత్రమే కాకుండా ప్రజల సహకారంతో కోవిడ్‌పై కూడా పోరాడగలమని రుజువు చేశారు’’ అని అమిత్ షా అన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నాయి. 

హర్యానాలోని కదర్‌పూర్ గ్రామంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశం విజయవంతంగా పోరాడుతోందని, దీనిని ప్రపంచం ముక్తకంఠంతో ప్రశంసిస్తోందని  చెప్పారు.

మన దేశం కోవిడ్-19పై ఎలా పోరాడగలదు? అని అందరూ అనుకున్నారన్నారు. చాలా మంది భయాలు వ్యక్తం చేశారన్నారు. అయితే కోవిడ్-19పై అత్యంత విజయవంతమైన పోరాటాల్లో ఒకటి మన దేశంలో ఎలా జరుగుతోందో ప్రపంచం నేడు గమనిస్తోందని చెప్పారు.

మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచిదని చెప్తూ, ఈ మొక్కలను పెంచే బాధ్యతను జవాన్లు చేపట్టాలన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే మొక్కలను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments