Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌ 30 వరకు ఆదాయపు పన్ను రిటర్నులకు అవకాశం

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:27 IST)
ఆదాయపన్ను చెల్లింపు దారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. చెల్లింపులకు మరికొంత గడువు ఇచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్‌) సమర్పించేందుకు చివరి తేదీని సెప్టెంబర్‌ 30గా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31 వరకు గతంలో పెంచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. 2019-20 ఆర్థిక సంత్సర రిటర్నులు సమర్పించేందుకు గడువును పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్‌ 30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ గడువును జులై 31కి పొడిగించింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 30వరకు పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments