Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌ 30 వరకు ఆదాయపు పన్ను రిటర్నులకు అవకాశం

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:27 IST)
ఆదాయపన్ను చెల్లింపు దారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. చెల్లింపులకు మరికొంత గడువు ఇచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్‌) సమర్పించేందుకు చివరి తేదీని సెప్టెంబర్‌ 30గా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31 వరకు గతంలో పెంచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. 2019-20 ఆర్థిక సంత్సర రిటర్నులు సమర్పించేందుకు గడువును పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్‌ 30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ గడువును జులై 31కి పొడిగించింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 30వరకు పొడిగించింది.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments