మరోమారు వరుడి తండ్రితో వధువు తల్లి పరార్‌

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (08:05 IST)
అవును.. వాళ్లిద్దరూ లేచిపోయారు. తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మాటల్లోకి దిగిన ఆ జంట.. విరహం తాపలేక లేచిపోయారు. వియ్యమందుకోవాల్సిన ఆ జంట.. పడక పంచుకున్నారు. ఇలా జరిగింది ఒక్కసారి కాదు.. ఇది రెండో సారి.
 
గుజరాత్‌లో జనవరి నెలలో తమ పిల్లల పెళ్లి సంబరాలకు ముందు ‘లేచిపోయిన’ ఓ వధువు తల్లి, వరుడి తండ్రి మళ్లీ అదే పనిచేశారు. సూరత్‌కు చెందిన హిమ్మత్‌ పాండవ్‌(46), నవ్‌సారీకి చెందిన శోభనా రావల్‌ పరస్పరం ఆకర్షితులై లేచిపోవడంతో పిల్లల పెళ్లి నిలిచిపోయింది.

అయితే కుటుంబ, సమాజ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల క్రితం తిరిగి వచ్చినా ఒకర్నొకరు విడిచి ఉండలేకపోయారు. మూడ్రోజుల క్రితం ఇద్దరూ మళ్లీ లేచిపోయారు. సూరత్‌లోనే ఓ ఇంట్లో సహజీవనం మొదలెట్టేశారు.

తొలిసారి వెళ్లిపోయినప్పుడు వారిరువురిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఈసారి మాత్రం ఏ కేసూ నమోదు చేయలేదు.

తిరిగివచ్చిన తరువాత శోభనను ఆమె భర్త ఇంట్లో అడుగుపెట్టనివ్వకపోవడంతో ఆమె తన తలిదండ్రుల ఇంట్లో ఉండిపోయింది.

లేచిపోయిన ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా పెద్దలు వద్దనడంతో ఏం చేయలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments