Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్లు ప్రజాప్రతిధులు కాదనే విషయం గుర్తెరగాలి : సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (11:35 IST)
గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు కాదనే విషయాన్ని గుర్తెరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
గవర్నర్లు తమ పనితీరుపై చిన్నపాటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. బిల్లుల ఆమోదం వివాదాలు సుప్రీంకోర్టుకు చేరక ముందే వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ చర్యల తాజా పరిస్థితిని వివరిస్తూ నివేదిక సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. 
 
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం... 'ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాదనే వాస్తవాన్ని గవర్నర్లు విస్మరించరాదు' అని హితవు పలికింది. పంజాబ్ ప్రభుత్వం తన ముందుంచిన బిల్లులు అన్నింటిపై గవర్నర్ చర్యలు తీసుకున్నారని, ప్రస్తుత వ్యాజ్యం అవసరంలేదని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. 
 
'విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలి' అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీని మళ్లీ సమావేశపర్చడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. మూడు బిల్లుల విషయమై పంజాబ్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తలెత్తింది. ఆప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments