Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్డీకొట్టు మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (08:43 IST)
దేశరాజధాని ఢిల్లీ నగరంలో కూరగాయల బండి (బడ్డీకొట్టు) పెట్టుకొని జీవించే ఒక మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం ద్వారకా ప్రాంతంలో జరిగింది. తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది.
 
ఆ తర్వాత తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ హత్యోదంతం మొత్తం దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
అయితే అక్కడకు వెళ్లే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని విభ (30)గా గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదారు. తాగిన మైకంలో విభ, ఆమె భర్తతో అతను గొడవపడ్డాడని, ఆ కోపంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు.
 
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు... నిందితుడి కోసం వెళ్లగా పోలీసులను కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని కాపాడిన పోలీసులు స్థానికంగా ఉన్న దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు విధులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments