Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఉబెర్, ర్యాపిడో సేవలు బంద్... సర్కారు ఆదేశాలు

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (07:41 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓలా, ఉబెర్, ర్యాపిడ్ సేవలు నిలిచిపోయాయి. ఈ మూడు సంస్థలకు చెందిన ఆటో రిక్షా సర్వీసులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో బుధవారం నుంచి ఈ ఆటో రిక్షా సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సంస్థలకు చెందిన ఆన్‌లైన్ బుకింగ్స్‌ను సైతం నిషేధిస్తున్నట్టు పేర్కొంది. 
 
రోడ్డు రవాణ సంస్థతో పాటు రోడ్డు భద్రత విభాగంతో మంగళవారం జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఈ సంస్థలు ప్రజలకు ఎటువంటి సేవలను కల్పించేందుకు అనుమతి లేదని రాష్ట్ర రవాణ సంస్థ కమిషనర్​ తెలిపారు. 
 
మరోవైపు, కర్ణాటక ఆన్-డిమాండ్ రవాణా టెక్నాలజీ ఆగ్రిగేటర్స్ రూల్(కొట్టార్-2016) చట్టం ప్రకారం క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులు అందించేందుకు అవకాశం లేదని రవాణా కమిషనర్ తెలిపారు. ఆటో రిక్షా సేవలు నిలిపివేసేలా సైబర్ డివిజన్​కు లేఖ రాస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments