చెత్త హెల్మెట్లతో మైదానంలో అయినా.. మైదానం వెలుపల అయినా వికెట్ పడుతుంది...

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (09:23 IST)
ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తుంటారు. కొందరు పోలీసులు సమాజంలో మనం కళ్ళెదుట జరిగే కొన్ని విచిత్ర సంఘటనల ఆధారంగా చేసుకుని వినూత్నంగా ఆలోచన చేస్తూ ప్రచారం చేస్తుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలోను విస్తృతంగా వాడుకుంటున్నారు. 
 
తెలంగాణాలో జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ట్రాఫిక్ పోలీసులు యూట్యూబ్ చానెల్‌లో షేర్ చస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే, హెల్మెట్ల నాణ్యతపై అవగాహన కల్పించేందుకు ఒడిశా రవాణా శాఖ వినూత్న పంథాను ఎంచుకుంది. 
 
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో భాగంగా ఇటీవల శ్రీలంక - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటనను ఉదహరిస్తూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ "టైమ్డ్ ఔట్" అయిన ఉదంతాన్ని నెట్టింట ప్రస్తావిస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. 
 
చెత్త క్వాలిటీ హెల్మెట్లతో మైదానంలో అయినా.. మైదానం వెలుపలు అయినా వికెట్ పడిపోతుందని హెచ్చరించింది. హెల్మట్ల నాణ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒడిశా రవాణా శాఖ అధికారులు చేసిన ప్రయత్నం నెటిజన్లకు అమితంగా నచ్చడంతో వారు ఈ పోస్టును నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

బిగ్ బాస్‌కు వెళ్ళడంతో కెరీర్ కోల్పోయాను : కరాటే కళ్యాణి

Pawan Kalyan: పవన్, హరీష్ శంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ తాజా అప్ డేట్

Samantha-Raj: సమంత, రాజ్ నిడిమోరు ఫ్యామిలీ ఫోటో వైరల్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments