Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కప్పు టీ తీసుకురాలేదనే కోపంతో సర్జరీని మధ్యలో ఆపేశాడు..

Advertiesment
Nagpur doctor
, బుధవారం, 8 నవంబరు 2023 (09:59 IST)
కప్పు టీ తీసుకురాలేదనే కోపంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపేసిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ భాలవి ఆసుపత్రి సిబ్బందిని ఒక కప్పు టీ ఇవ్వాలని కోరారు. 
 
కానీ అందివ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు. స్టెరిలైజేషన్ సర్జరీని సగంలోనే వదిలేసి వెళ్లారు. సర్జరీల కోసం ఎనిమిది మంది మహిళలను హాస్పిటల్‌కు పిలిపించారు. 
 
అప్పటికే అనస్థీషియా ఇవ్వడంతో నలుగురు మహిళలు మత్తులోకి జారుకుని ఉన్న సమయంలో డాక్టర్ భాలవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. బాధిత మహిళల కుటుంబ సభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నంలో నికాన్ Z f పరిచయంతో మిర్రర్‌లెస్ కెమెరా పోర్ట్‌ఫోలియో