Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ అన్నెంపున్నెం ఎరుగని శిశువుకు పురుగుల మందు...

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:54 IST)
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ కిరాతక భర్త.. అన్నెంపున్నెం ఎరుగని శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బాలేశ్వర్‌లో జరిగింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ సాగరిక నాథ్ స్పందిస్తూ, చందన్‌కు తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9వ తేదీన ఆడపిల్ల పుట్టింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందువల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్‌ రగిలిపోయాడు. ప్రసవమైన రెండు వారాలకు స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తన్మయి పుట్టింటికి వెళ్లింది. 
 
భార్యాబిడ్డలను చూసే నెపంతో సోమవారం అక్కడకు చేరుకొన్న చందన్‌.. భార్య మరో గదిలో ఉన్న సమయంలో చిన్నారి శరీరంలోకి సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. శిశువు ఏడుపు విన్న తన్మయి భర్తను నిలదీయగా బుకాయించాడు. వెంటనే పాపను బాలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments