Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ పరీక్ష రాసిన ఎమ్మెల్యే... ఎక్కడ?

Webdunia
శనివారం, 31 జులై 2021 (08:57 IST)
చాలా మంది పాలకులకు కనీస విద్యార్హత కూడా ఉండదు. ప్రజాబలం, ధనబలం, అంగబలంతో అధికారంలోకి వస్తుంటారు. అయితే, కొందరు ప్రజాప్రతినిధులైన తర్వాత కూడా విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారిలో ఈ శాసనసభ్యుడు ఒకరు. ఓ ఎమ్మెల్యే తాజాగా పదో తరగతి పరీక్షలను రాశారు. ఆయన పేరు పూర్ణచంద్ర స్వైన్. ఒడిషా శాసనసభలో బీజేడీ సభ్యుడు. సూరాడ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
ఒడిషా రాష్ట్రంలో శుక్రవారం నుంచి టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు ఒడిశా శాసనసభ్యుడు పూర్ణచంద్ర స్వైన్ కూడా ఓ విద్యార్థిలాగా పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చారు. ఆయన దూరవిద్య విధానంలో పది చదివారు. 
 
కరోనా నేపథ్యంలో ఒడిశా సర్కారు ఈ ఏడాది అందరినీ పాస్ చేసింది. తాము కేటాయించిన మార్కులు నచ్చనివారు పరీక్షలు రాసే అవకాశాన్ని సర్కారు కల్పించింది. దాంతో, ఎమ్మెల్యే పూర్ణచంద్ర ఎక్కువ మార్కుల కోసం పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు.
 
సూరాడలోని బాలికల ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యేని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఓ బైక్‌పై సాధారణ వ్యక్తిలా వచ్చారు. మరో బైక్‌పై సెక్యూరిటీ సిబ్బంది కూడా పరీక్ష కేంద్రం వద్దకు వచ్చారు. కరోనా నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన అక్కడి సిబ్బంది ఆయనను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments