Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి అనుమానం... తల తెగనరికి... ఠాణాకెళ్లి లొంగిన నిందితుడు.. ఎక్కడ?

Odisha
Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (08:18 IST)
చేతబడి అనుమానంతో ఓ వ్యక్తి తల తెగనరికి, ఆ తలను చేతపట్టుకుని ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి వెళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళి లొంగిపోయిన దారుణ ఘటన ఒకటి ఒడిషా రాష్ట్రంలో జరిగింది. ఒక చేతిలో తల, మరో చేతిలో తలను తెగనరికిన గొడ్డలిని చూసిన పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని ఖుంటూ పోలీస్ స్టేషన్ పరిధిలో నువాసహి అనే గిరిజన గ్రామమానికి చెందిన బుద్దురామ్ సింగ్ (30) తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. ఈయన కుమార్తె ఒకరు అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచింది. 
 
అయితే, తన కుమార్తె చనిపోవడానికి వరుసకు అత్త అయిన చంపాన్ సింగ్ (60) అనే వృద్ధురాలు కారణమని బుద్దారామ్ సింగ్ బలంగా నమ్మాడు. చంపాన్ సింగ్ చేతబడి చేయించడం వల్లే తన కుమార్తె చనిపోయిందని అనుమానించి, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ పథకంలో భాగంగా, సోమవారం ఉదయం ఇంటి వరండాలో నిద్రిస్తున్న చంపాన్‌ సింగ్‌ను బుద్దురామ్‌సింగ్ బయటకు ఈడ్చుకొచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, ఆ తలను తువ్వాలులో చుట్టుకుని, హత్యకు ఉపయోగించిన గొడ్డలి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. 13 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తల, గొడ్డలితో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని చూసిన పోలీసులు హడలిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments