Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి అనుమానం... తల తెగనరికి... ఠాణాకెళ్లి లొంగిన నిందితుడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (08:18 IST)
చేతబడి అనుమానంతో ఓ వ్యక్తి తల తెగనరికి, ఆ తలను చేతపట్టుకుని ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి వెళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళి లొంగిపోయిన దారుణ ఘటన ఒకటి ఒడిషా రాష్ట్రంలో జరిగింది. ఒక చేతిలో తల, మరో చేతిలో తలను తెగనరికిన గొడ్డలిని చూసిన పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని ఖుంటూ పోలీస్ స్టేషన్ పరిధిలో నువాసహి అనే గిరిజన గ్రామమానికి చెందిన బుద్దురామ్ సింగ్ (30) తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. ఈయన కుమార్తె ఒకరు అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచింది. 
 
అయితే, తన కుమార్తె చనిపోవడానికి వరుసకు అత్త అయిన చంపాన్ సింగ్ (60) అనే వృద్ధురాలు కారణమని బుద్దారామ్ సింగ్ బలంగా నమ్మాడు. చంపాన్ సింగ్ చేతబడి చేయించడం వల్లే తన కుమార్తె చనిపోయిందని అనుమానించి, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ పథకంలో భాగంగా, సోమవారం ఉదయం ఇంటి వరండాలో నిద్రిస్తున్న చంపాన్‌ సింగ్‌ను బుద్దురామ్‌సింగ్ బయటకు ఈడ్చుకొచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, ఆ తలను తువ్వాలులో చుట్టుకుని, హత్యకు ఉపయోగించిన గొడ్డలి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. 13 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తల, గొడ్డలితో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని చూసిన పోలీసులు హడలిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments