Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500లు అప్పు.. తిరిగి ఇవ్వలేదని.. హత్య చేసేశాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (12:45 IST)
అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హతమార్చాడు. తర్వాత దర్జాగా సొంతూరు వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిభరామ్ దాస్, దుర్బధన్ ఉపాధి కోసం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు వచ్చారు. 
 
ఓ తాపీ మేస్త్రి వద్ద ఇద్దరూ కూలిపనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిభరరామ్ దాస్ వద్ద.. దుర్బధన్ రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. అందులో రూ.500 తిరిగిచ్చేశాడు. మరో రూ.500 ఇవ్వడంలో ఆలస్యం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. చిన్న గొడవ కాస్తా మాటామాటా పెరగడంతో ఘర్షణ జరిగింది. ఈ గొడవలో దుర్భధన్ సిభరామ్‌ను కొట్టి చంపేశాడు. 
 
ఆ గొడవలో దుర్బధన్.. సిభరామ్ ను కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని వారు ఉంటున్న ఇంటివెనుక పొదల్లో పడేసి స్వగ్రామానికి పారిపోయాడు. నాలుగు రోజుల తర్వాత పొదల్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులకు తొలుత హత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. దాదాపు వారం రోజుల పాటు వివిధ కోణాల్లో జరిగిన విచారణలో దుర్భధనే హత్య చేశాడని తెలిసింది. దీంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments