Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన బీజేడీ ఎమ్మెల్యే.. ఠాణాలో ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (09:09 IST)
ఒడిషా రాష్ట్రంలో బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు(బీజేడీ) విజయ్‌శంకర్‌ దాస్‌పై సోనాలిక అనే యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసగించాడని ఆరోపించారు. 
 
ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకరించారని, పెళ్లి చేసుకునేందుకు జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మే 17న దరఖాస్తు చేసుకోగా, అధికారులు శుక్రవారం స్లాట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
తాను కార్యాలయానికి వెళ్లినా, ఎమ్మెల్యే రాకపోవడంతో రెండుగంటల పాటు నిరీక్షించి, వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసగించినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments