Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లింది.. తొలి రోజే గ్యాంగ్ రేప్, ఆత్మహత్య చేసుకుంది

Webdunia
ఆదివారం, 1 మే 2022 (13:42 IST)
కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు.. తాను పనిలో చేరిన తొలి రోజే శవమై కనిపించింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో జరిగింది. తొలి రోజు ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు తెల్లవారేసరికి ఆస్పత్రిలోనే ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉన్నావాలోని ఓ నర్సింగ్ హోంలో అదే ప్రాంతానికి చెందిన ఓ నర్సుకు ఉద్యోగం లభించింది. దీంతో శుక్రవారం కోటి ఆశలతో ఉద్యోగాని వెళ్ళింది. అయితే, మరుసటి రోజు తెల్లారేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తెపై లైంగికదాడి చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని ఉన్నావో అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం