Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్‌కు పిలిచి కోడిగుడ్డు కూర వడ్డించలేదని ఫ్రెండ్‌ను చంపేసిన కిరాతకుడు!

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (09:04 IST)
మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. తన స్నేహితుని ఇంటికి డిన్నర్‌కు వచ్చిన మరో ఫ్రెండ్... తనకు కోడిగుడ్డు కూర వండి వడ్డించలేదని ఆగ్రహించాడు. ఈ ఆగ్రహాన్ని తట్టుకోలేక తనను డిన్నర్‌కు పలిచిన స్నేహిడుతుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగ్‌పూర్‌లోని మకాపూర్ ప్రాంతానికి చెందిన బన్సారీ (40) శనివారం రాత్రి తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. దీంతో గైక్వాడ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బన్సారీ, గైక్వాడ్‌లు కలిసి మద్యం సేవించారు.
 
పిమ్మట భోజనానికి కూర్చొన్నారు. భోజనంలో ఇంట్లో తయారు చేసిన అన్ని రకాల కూరలను వడ్డించారు. అయితే, గైక్వాడ్ మాత్రం కోడిగుడ్డు కూర ఎక్కడ అంటూ బన్సారీని ప్రశ్నించగా, అది వండలేదని బదులిచ్చాడు. 
 
దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చివరకు ముదిరిపాకనపడటంతో కోపం పట్టలేని గైక్వాడ్ ఇనుపరాడ్డుతో బన్సారీ తలపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments