Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతనాలు చెల్లించని ప్రైవేటు సంస్థలపై చర్యలొద్దు : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:27 IST)
లాక్డౌన్ సమయంలో వేతనాలు చెల్లించని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో లాక్డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సలహా ఇచ్చింది. 
 
లాక్డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్​ చేస్తూ.. పలు కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ ఎంఆర్​ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి శుక్రవారం తీర్పునిచ్చింది. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచన చేసింది. యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య సయోధ్య కుదుర్చాలని రాష్ట్రాలను కోరింది. మార్చి 29న ఇచ్చిన ఆదేశాల చట్ట బద్ధతపై నాలుగు వారాల్లో అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
 
లాక్డౌన్​ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేని ప్రైవేటు సంస్థలపై జులై చివరి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. వేతనాల సమస్యపై యాజమాన్యాలు, ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది. దానికి సంబంధించిన పూర్తి నివేదికను లేబర్​ కమిషనర్లకు సమర్పించాలని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments