నిర్భయ దోషులకు ఉరి ముహూర్తం ఖరారు... రూ.వేలు సంపాదించిన ముద్దాయిలు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:29 IST)
నిర్భయ కేసులో ముద్దాయిలుగా ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఈ దోషులకు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని మీరట్ జైలు తలారి పవన్ గుప్తా ఉరితీయనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఈ నలుగురు ముద్దాయిలకు పెడుతున్న ఆహారాన్ని గణనీయంగా తగ్గించారు. అలాగే, ఈ దోషులు జైలులో ఇష్టానుసారంగా, అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వీరికి జైలు అధికారులు శిక్షలు కూడా అమలు చేశారు. ముఖ్యంగా, వినయ్ శర్మ అనుచితంగా ప్రవర్తించినందున 11 సార్లు శిక్షించారు. అలాగే, పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
 
మరోవైపు, ఈ నలుగురు దోషుల్లో ముగ్గురు జైల్లో వివిధ రకాల పనులు చేస్తూ కొన్ని వేల రూపాయలు సంపాదించారు. ముఖేశ్  సింగ్ 69 వేల రూపాయలు సంపాదించగా, వినయ్ శర్మ రూ.39 వేలు, పవన్ గుప్తా రూ.29 వేలు చొప్పున సంపాదించారు. ఈ మొత్తాన్ని ఉరితీత తర్వాత మృతదేహాలను అప్పగించే సమయంలో వారివారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments