Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకు ఉరి ముహూర్తం ఖరారు... రూ.వేలు సంపాదించిన ముద్దాయిలు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:29 IST)
నిర్భయ కేసులో ముద్దాయిలుగా ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఈ దోషులకు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని మీరట్ జైలు తలారి పవన్ గుప్తా ఉరితీయనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఈ నలుగురు ముద్దాయిలకు పెడుతున్న ఆహారాన్ని గణనీయంగా తగ్గించారు. అలాగే, ఈ దోషులు జైలులో ఇష్టానుసారంగా, అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వీరికి జైలు అధికారులు శిక్షలు కూడా అమలు చేశారు. ముఖ్యంగా, వినయ్ శర్మ అనుచితంగా ప్రవర్తించినందున 11 సార్లు శిక్షించారు. అలాగే, పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
 
మరోవైపు, ఈ నలుగురు దోషుల్లో ముగ్గురు జైల్లో వివిధ రకాల పనులు చేస్తూ కొన్ని వేల రూపాయలు సంపాదించారు. ముఖేశ్  సింగ్ 69 వేల రూపాయలు సంపాదించగా, వినయ్ శర్మ రూ.39 వేలు, పవన్ గుప్తా రూ.29 వేలు చొప్పున సంపాదించారు. ఈ మొత్తాన్ని ఉరితీత తర్వాత మృతదేహాలను అప్పగించే సమయంలో వారివారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments