Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకు ఉరి ముహూర్తం ఖరారు... రూ.వేలు సంపాదించిన ముద్దాయిలు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:29 IST)
నిర్భయ కేసులో ముద్దాయిలుగా ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఈ దోషులకు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని మీరట్ జైలు తలారి పవన్ గుప్తా ఉరితీయనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఈ నలుగురు ముద్దాయిలకు పెడుతున్న ఆహారాన్ని గణనీయంగా తగ్గించారు. అలాగే, ఈ దోషులు జైలులో ఇష్టానుసారంగా, అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వీరికి జైలు అధికారులు శిక్షలు కూడా అమలు చేశారు. ముఖ్యంగా, వినయ్ శర్మ అనుచితంగా ప్రవర్తించినందున 11 సార్లు శిక్షించారు. అలాగే, పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
 
మరోవైపు, ఈ నలుగురు దోషుల్లో ముగ్గురు జైల్లో వివిధ రకాల పనులు చేస్తూ కొన్ని వేల రూపాయలు సంపాదించారు. ముఖేశ్  సింగ్ 69 వేల రూపాయలు సంపాదించగా, వినయ్ శర్మ రూ.39 వేలు, పవన్ గుప్తా రూ.29 వేలు చొప్పున సంపాదించారు. ఈ మొత్తాన్ని ఉరితీత తర్వాత మృతదేహాలను అప్పగించే సమయంలో వారివారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments