Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై బావ అత్యాచారం... పిల్లల్ని చంపేస్తానని బెదిరించి...

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (12:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. వరుసకు మరదలి అయ్యే మహిళపై బావ అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఆమె పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లోని బజ్గేరా గ్రామంలో ఓ వ్యాపారి భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకు ఇంటి సమీపంలో వరుసకు సోదరుడయ్యే ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తరచూ తమ్ముడి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేశాడు. 
 
తన వ్యాపార పనుల్లో తమ్ముడు ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వస్తుండటంతో ఇదే అదనుగా భావించిన అన్న ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.

అయితే అతని వేధింపులు భరించలేక తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో అతను స్థానిక పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశాడు. కేసు నమోద చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments