Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ ఇవ్వలేదనీ కాల్పులు జరిపిన దుండగులు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:20 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అడిగితే సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బాధితుడు తప్పించుకోగా, కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన అమిర్ ఖాన్ అనే యువకుడు తన మిత్రుడితో కలిసి గురువారం రాత్రి 9:30 సమయంలో ఓ షాపింగ్ మాల్ దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాడు. ఇంతలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమిర్ ఖాన్‌‌ను సిగరెట్ అడిగారు. అందుకతడు నిరాకరించడంతో.. ఆ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. 
 
మాట్లాడుతుండగానే బైక్ మీద కూర్చున్న మరో వ్యక్తి తన పిస్టల్‌ తీసుకుని అమిర్ ఖాన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అదే బైక్‌పై పరారయ్యారు. కాగా అమిర్ ఖాన్ ఛాతీలో ఓ బుల్లెట్ దిగింది. కానీ, అదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments