ఆవు, పంది మాంసం తినే నెహ్రూను పండిట్ అంటారా?: అహూజా

ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమని.. లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (11:10 IST)
ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమని.. లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థులే కారణమని కూడా అహూజా ఆరోపించారు. 
 
తాజాగా భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆవు, పంది మాసం తినే నెహ్రూ అసలు పండిటే కాదని విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అని చేర్చిందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
 
కేవలం ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పార్టీ ముందు పండిట్ అనే పదాన్ని చేర్చిందని అహుజా విమర్శలు గుప్పించారు. అహూజా వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమై వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments