Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (12:42 IST)
దేశంలోని వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. గత యేడాది నిర్వహించిన పరీక్షల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ యేడాది నిర్వహించే పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీఏ వివరణ ఇచ్చింది. 2025 మే నెలలో నిర్వహించే ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. 
 
ఒకేరోజు, ఒకే షిఫ్ట్ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) ప్రకటించింది. నీట్-2025ను ఓఎంఆర్ విధానంలో నిర్వహిం చాలా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించాలా? అనే విషయంలో కేంద్ర విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు నెలరోజులుగా మల్ల గుల్లాలు పడ్డాయి. 
 
ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన రెండు సార్లు సమావేశం కూడా నిర్వహించారు. చివరికి ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఎన్డీఏ వెబ్ సైట్‌ పరిశీలించవచ్చని ఎన్టీయే తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments