పాటియాలా సెంట్రల్ జైలుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
శనివారం, 21 మే 2022 (09:51 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ పోలీసులు పాటియాలా కేంద్ర కారాగారానికి తరలించారు. మూడు దేశాబ్దాల క్రితం జరిగిన గొడవలో సిద్ధూ కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆయనకు యేడాది జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి దుస్తుల బ్యాగును తీసుకుని కోర్టుకు వెళ్లారు. 
 
ఆ తర్వాత నిబంధనల మేరకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులే సిద్ధూను పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లొంగిపోవడానికి మరికొద్ది రోజుల సమయం కావాలంటూ శుక్రవారం సిద్ధూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
 
ప్రత్యేక బెంచ్ ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్‌ను సమర్పించాలని, ఆయన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పింది. దీంతో సిద్ధూ కోర్టులోనే లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments