Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటియాలా సెంట్రల్ జైలుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
శనివారం, 21 మే 2022 (09:51 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ పోలీసులు పాటియాలా కేంద్ర కారాగారానికి తరలించారు. మూడు దేశాబ్దాల క్రితం జరిగిన గొడవలో సిద్ధూ కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆయనకు యేడాది జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి దుస్తుల బ్యాగును తీసుకుని కోర్టుకు వెళ్లారు. 
 
ఆ తర్వాత నిబంధనల మేరకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులే సిద్ధూను పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లొంగిపోవడానికి మరికొద్ది రోజుల సమయం కావాలంటూ శుక్రవారం సిద్ధూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
 
ప్రత్యేక బెంచ్ ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్‌ను సమర్పించాలని, ఆయన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పింది. దీంతో సిద్ధూ కోర్టులోనే లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments