Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కూడా ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:41 IST)
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాంగ్రెస్ అధినేతల వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద విచారణ జరిపిన ఈడీ అధికారులు ఇపుడు ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద విచారణ జరుపుతున్నారు. 
 
ఇప్పటికే తొలి దఫాలో 3 గంటలు, రెండో దఫాలో 6 గంటల పాటు విచారణ జరిపారు. మూడో దఫాగా బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. దీంతో బుధవారం కూడా ఆమె హాజరుకానున్నారు. 
 
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ వద్ద ఈడీ అధికారులు తొలిసారి ఈ నెల 21వ తేదీన విచారణ జరిపిన విషయం తెల్సిందే. రెండు దఫాలుగా జరిపిన విచారణలో సోనియా వద్ద మొత్తం 9 గంటల పాటు విచారణ సాగింది. 
 
మరోవైపు, ఈ కేసులో రాహుల్, సోనియాల వద్ద ఈడీ అధికారులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments