Webdunia - Bharat's app for daily news and videos

Install App

Narendra Modi: ఆ చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (17:51 IST)
దిల్లీ: ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) రోజులను ఎప్పటికీ మరచిపోలేమంటూ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను అణచి వేసిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘ఆ ఆత్యయిక స్థితినాటి చీకటి రోజులను ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగ సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా జీవిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ అణచివేసింది.

ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి, భారత ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడినవారంతా చిరస్మరణీయులు’ అంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు. అలాగే ‘డార్క్‌డేస్‌ ఆఫ్ ఎమర్జెన్సీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా బీజేపీ ఫర్ ఇండియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన పోస్టును జోడించారు.
 
మర్జెన్సీ కాలంలో ఏమేమి నిషేధానికి గురయ్యాయో చిత్రరూపంలో వివరిస్తూ.. భాజపా ఆ పరిస్థితులను నిరసించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అది సుమారు 21 నెలలపాటు కొనసాగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments