Webdunia - Bharat's app for daily news and videos

Install App

Narendra Modi: ఆ చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (17:51 IST)
దిల్లీ: ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) రోజులను ఎప్పటికీ మరచిపోలేమంటూ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను అణచి వేసిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘ఆ ఆత్యయిక స్థితినాటి చీకటి రోజులను ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగ సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా జీవిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ అణచివేసింది.

ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి, భారత ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడినవారంతా చిరస్మరణీయులు’ అంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు. అలాగే ‘డార్క్‌డేస్‌ ఆఫ్ ఎమర్జెన్సీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా బీజేపీ ఫర్ ఇండియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన పోస్టును జోడించారు.
 
మర్జెన్సీ కాలంలో ఏమేమి నిషేధానికి గురయ్యాయో చిత్రరూపంలో వివరిస్తూ.. భాజపా ఆ పరిస్థితులను నిరసించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అది సుమారు 21 నెలలపాటు కొనసాగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments