Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసిన కాటికాపరి కుటుంబ సభ్యుడు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:30 IST)
లోక్‌సభ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను శుక్రవారం సమర్పించారు. గత ఎన్నికల్లో వారణాసితోపాటు వడోదరాలో పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల తర్వాత వడోదరా స్థానానికి రాజీనామా చేసి, వారణాసి స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 
 
ఈ 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, మోడీని ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించినవారిలో ఓ కాటికాపరి కుటుంబ సభ్యుడు కూడా ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వారణాసిలోని ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్ వద్ద దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి నరేంద్ర మోడీ తనను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. 
 
అంతేకాగాకుండా, ఆయన పేరును ప్రతిపాదించినవారిలో ఓ వాచ్‌మన్, ఓ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు, బీజేపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మోడీ స్థానిక కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీయే భాగస్వాములైన ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నపూర్ణ శుక్లా వంటి పెద్దవాళ్లకు మోడీ సనాతన ధర్మం ప్రకారం పాదాభివందనం చేసి నామినేషన్ దాఖలుకు బయల్దేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments