నా కుక్క చనిపోయింది, నేనూ చనిపోతున్నానంటూ యువతి ఆత్మహత్య

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (19:59 IST)
తన పెంపుడు కుక్క చనిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న విషాద ఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గ‌ఢ్ జిల్లా గోర్ఖా ప్రాంతంలోని కొట్రా రోడ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో 21 ఏళ్ల ప్రియాన్షుసింగ్ పీజీ చదువుతోంది. తనకు తన పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. గత నాలుగేళ్లుగా ఈ కుక్కను ఆమె పెంచుతోంది. ఐతే కుక్కకు అనారోగ్యం కలుగడంతో అది చనిపోయింది.
 
ఆ కుక్క చనిపోగానే ప్రియాన్షు తీవ్ర మనస్తాపానికి గురై ఆవేదన చెందుతూ వుంది. కుక్క బుధవారం నాడు మృతి చెందగా అదే రాత్రి ఆ యువతి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతదేహాన్ని దహనం చేయవద్దనీ, కుక్కను ఎక్కడ ఖననం చేసారో అక్కడే తనను కూడా ఖననం చేయాలని సూసైడ్ నోట్ రాసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments