Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీఎస్‌ఎల్: మ్యాచ్ గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి.. ఎవరో తెలుసా?

పీఎస్‌ఎల్: మ్యాచ్ గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి.. ఎవరో తెలుసా?
, సోమవారం, 16 నవంబరు 2020 (12:54 IST)
PSL
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌లో అనుకోని అతిథి గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య జరగుతున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. చివరకి ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్ 14 ఓవర్ సందర్భంగా మ్యాచ్ ఆగిపోయింది. 
 
ఓ శునకం మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి వచ్చి అక్కడే కూర్చుండి పోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనా గ్రౌండ్ సిబ్బంది దానిని వెంటనే మైదానం నుంచి బయటకు పంపించారు. కెమెరాలు కూడా మైదానంలోకి వచ్చిన ఆ అతిథిని పదేపదే చూపిస్తూ అభిమానులను నవ్వుకునేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. రవి బోపారా(40), సోహైల్ తన్వీర్(21) హిటింగ్‌తో కరాచీ కింగ్స్ ముందు పోరాడ్ లక్ష్యాన్ని ఉంచింది ముల్తాన్ సుల్తాన్. 
 
అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్సే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌ వరకు వెళ్ళింది. ఇక సూపర్ ఓవర్‌లో కరాచీ కింగ్స్ 13 రన్స్ చేసింది. తర్వాత ముల్తాన్ సుల్తాన్ 9 పరుగులే చేసి ఓటమి చెందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ విస్తరణకు సరైన సమయం ఇదే : రాహుల్ ద్రవిడ్