Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో నాంది: చెయ్యని తప్పుకు 20 ఏళ్లు జైలు శిక్ష

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (08:49 IST)
UP Man
అల్లరి నరేష్ నాంది సినిమాలో చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించారు. ప్రస్తుతం ఇదే తరహా ఘటన రియల్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో చేయని తప్పుకు ఓ వ్యక్తి గత 20 ఏళ్లుగా జైలు శిక్షను అనుభవించాడు. లలిత్ పూర్‌కు చెందిన 23 ఏళ్ల విష్ణు తివారి అత్యాచారం కేసులో 2000 సెప్టెంబర్ 1 వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తరువాత జైల్లో ఉన్నాడు. 
 
దాదాపుగా ఈ కేసు 20 ఏళ్ళు నడిచింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని విష్ణు తివారి ఎవరూ నమ్మలేదట. 20 ఏళ్లపాటు సుదీర్ఘమైన పోరాటం చేయడంతో నిరపరాధిగా బయటపడ్డాడు. గతనెల 28 వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ విష్ణు తివారీని నిరపరాధిగా పేర్కొంటూ విడుదల చేసింది. 
 
23 సంవత్సరాల వయసులో జైలుకు వెళ్లిన విష్ణు తివారి, 43 ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. ఎలాంటి తప్పు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదని, 20 ఏళ్ళు జైల్లో ఉండటం వలన తన కుటుంబాన్ని కోల్పోయానని, తనకు సోదరుడు మినహా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments