Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫస్టే డే శోభనం ముగిసింది, భర్త లేచి చూసేసరికి షాక్

ఫస్టే డే శోభనం ముగిసింది, భర్త లేచి చూసేసరికి షాక్
, శుక్రవారం, 5 మార్చి 2021 (17:06 IST)
ఎవరికైనా మొదటి రాత్రి చాలా ముఖ్యమైనది. ఆ రోజు కోసం కొత్త జంటలు వేయికళ్లతో వేచి చూస్తూ ఉంటారు. అయితే అతనికి మాత్రం ఫస్ట్ డే శోభనం కాస్త చేదుగా మారింది. తాళికట్టిన భార్య తన ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయింది. 
 
నెల్లూరుజిల్లా సమీపంలోని పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన మురళికి ఇది వరకే పెళ్లయ్యింది. ఆరునెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది భార్య. పిల్లలు ఇద్దరు చిన్నవారు కావడంతో ఇంకో పెళ్ళి చేసుకున్నాడు మురళి. 
 
అదే ఊరికి చెందిన రాజమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. మొదటిరోజు... ఫస్ట్ డే శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం ముగిసింది. పెళ్లి కొడుకు మంచి నిద్రలో ఉన్నాడు. అయితే నిద్ర లేచి ఉదయం చూసేసరికి పక్కన భార్య లేదు...ఇంట్లో నగలు కూడా లేవు. 
 
80 వేల రూపాయల నగదులో పాటు 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్ళింది. దీంతో బంధువులందరూ అవాక్కవుతున్నారు. ఆమె ఒక్కటే డబ్బులు, బంగారాన్ని తీసుకెళ్లిందా.. లేకుంటే ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానం బంధువుల్లో కలుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘ఆదిరా’తో రిలయన్స్ జ్యువెల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సం